BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:43 PM
30 వీక్షణలు

కాకినాడలో నర్సింగ్ విద్యార్థినుల వివాదం సుఖాంతం.. సీఎం చంద్రబాబు జోక్యంతో సమస్య పరిష్కారం

కాకినాడ, ఆగస్టు 23:

కాకినాడలోని ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థినుల మధ్య తలెత్తిన వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యంతో సామరస్యంగా పరిష్కారమైంది. ఘటనపై వెంటనే స్పందించిన సీఎం ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా యంత్రాంగం వేగంగా చర్యలు చేపట్టింది.

ఎస్‌కే నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థినుల మధ్య జరిగిన ఘర్షణ విషయం ముఖ్యమంత్రి దృష్టికి చేరింది. దీంతో ఆయన వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్, ఎస్పీ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.

విద్యార్థినుల భద్రతకు పూర్తి భరోసా కల్పించిన అధికారులు, వారికి అవసరమైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం కాలేజీ యాజమాన్యంతో చర్చలు జరిపి వివాదాన్ని పరిష్కరించారు.

ప్రభుత్వ యంత్రాంగం సత్వర స్పందనపై ఈశాన్య రాష్ట్రాల విద్యార్థినులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల చొరవతో సమస్య పెద్దదిగా మారకముందే సామరస్యంగా ముగిసింది.