BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

కామాంధుల వేధింపుల ఆరోపణలతో షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య.. పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:45 PM
78 వీక్షణలు

హీరోయిన్ కావాలన్న కలతో నగరానికి వచ్చిన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఆమె కెరీర్ ప్రారంభ దశలోనే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందినట్టు సమాచారం.

అయితే కొంతమంది యువకులు ఆమె వ్యక్తిగత వీడియోలు రహస్యంగా చిత్రీకరించి, వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తమ కోరికలు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారని, తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ వేధింపులను భరించలేక అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఘటనకు ముందు పోలీసులను ఆశ్రయించినా సరైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, దాదాపు 10 రోజులు గడిచినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తమవుతోంది. నిందితుల్లో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.