BREAKING
స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం చిలకలూరిపేట లింగంగుంట్లలో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన పల్నాడు జిల్లాలో రేపు సీఎం చంద్రబాబు పర్యటన ప్రకృతి ఒడిలో కడప క్రికెట్ స్టేడియం
www.ntodaynews.com

కామాంధుల వేధింపుల ఆరోపణలతో షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య.. పోలీసుల నిర్లక్ష్యంపై ఆరోపణలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jun, 2026 - 06:45 PM
48 వీక్షణలు

హీరోయిన్ కావాలన్న కలతో నగరానికి వచ్చిన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. ఆమె కెరీర్ ప్రారంభ దశలోనే షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి గుర్తింపు పొందినట్టు సమాచారం.

అయితే కొంతమంది యువకులు ఆమె వ్యక్తిగత వీడియోలు రహస్యంగా చిత్రీకరించి, వాటిని లీక్ చేస్తామని బెదిరిస్తూ గత ఆరు నెలలుగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తమ కోరికలు తీర్చాలని ఒత్తిడి తీసుకొచ్చారని, తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఈ వేధింపులను భరించలేక అమూల్య శ్రీ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఘటనకు ముందు పోలీసులను ఆశ్రయించినా సరైన చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు నిందితులను అరెస్ట్ చేయలేదని, దాదాపు 10 రోజులు గడిచినా చర్యలు లేవని ఆవేదన వ్యక్తమవుతోంది. నిందితుల్లో నలుగురు యువకులతో పాటు ఒక యువతి కూడా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన శిక్షలు విధించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.