కామ్రేడ్ సత్తార్కు ఘన నివాళి
కామ్రేడ్ సత్తార్కు ఘన నివాళి
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత అమరుడు కామ్రేడ్ పటాన్ సత్తార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సత్తార్, వామపక్ష భావజాలంతో కార్మిక రంగంలో అనేక పోరాటాలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. రాయలసీమలో పార్టీ అభివృద్ధికి సత్తార్ ఎనలేని కృషి చేశారని తెలిపారు.
డబుల్ ఇంజన్ పాలన కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్లో నిర్బంధించిన నోయిడా కార్మికులందరినీ భేషరతుగా విడుదల చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మతోన్మాద ఫాసిస్ట్ శక్తులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యులర్ భావజాలంతో ప్రజలతో మమేకమైన సత్తార్ లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. అరుణ, ఏలూరు జిల్లా ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, లిబరేషన్ సభ్యులు చాట్ల బాబురావు, భవాని తదితరులు పాల్గొన్నారు.