BREAKING
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ రాయచోటి ట్రాఫిక్ సీఐగా ఎన్.శేఖర్ బాధ్యతల స్వీకరణ పల్నాడు జిల్లాలో డ్రగ్స్ కేసు.. నలుగురు అరెస్ట్, MDMA స్వాధీనం మస్జిద్-ఎ-ఇలియాస్ శంకుస్థాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు గొల్లప్రోలులో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం గొల్లప్రోలులో జనసేన నాయకుడు తరాలి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: నాదెండ్ల ఎస్సై ఆర్.వెంకటేశ్వర్లు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం
www.ntodaynews.com

కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 May, 2026 - 06:46 AM
210 వీక్షణలు

కామ్రేడ్ సత్తార్‌కు ఘన నివాళి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో సీపీఐ ఎంఎల్ లిబరేషన్ నేత అమరుడు కామ్రేడ్ పటాన్ సత్తార్ ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా హరినాథ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన సత్తార్, వామపక్ష భావజాలంతో కార్మిక రంగంలో అనేక పోరాటాలు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని కొనియాడారు. రాయలసీమలో పార్టీ అభివృద్ధికి సత్తార్ ఎనలేని కృషి చేశారని తెలిపారు.

డబుల్ ఇంజన్ పాలన కొనసాగుతున్న ఉత్తరప్రదేశ్‌లో నిర్బంధించిన నోయిడా కార్మికులందరినీ భేషరతుగా విడుదల చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మతోన్మాద ఫాసిస్ట్ శక్తులు విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యులర్ భావజాలంతో ప్రజలతో మమేకమైన సత్తార్ లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీటీయూ రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు టి. అరుణ, ఏలూరు జిల్లా ఏఐసీసీటీయూ కార్యదర్శి వేముల బక్కయ్య, లిబరేషన్ సభ్యులు చాట్ల బాబురావు, భవాని తదితరులు పాల్గొన్నారు.