రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ నాయకుడు నిమ్మల విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన కొక్కిరాల సురేఖ
నిమ్మల విజయ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. ఆర్థిక సహాయం అందజేత
మంచిర్యాల | N Today News
ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిమ్మల విజయ్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ శనివారం (01-08-2026) వారి నివాసంలో పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని మనోధైర్యం కల్పించారు. అనంతరం కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, కార్పొరేటర్లు గాండ్ల సత్తమ్మ, పూదరి ప్రభాకర్, టీపీసీసీ సభ్యుడు, నస్పూర్ పట్టణ ఇన్చార్జి నూకల రమేష్, మంచిర్యాల పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.