www.ntodaynews.com
కారకంపాడులో ఘనంగా బాలాత్రిపురసుందరి సమేత ముఖలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం
ఆంధ్రప్రదేశ్
కృష్ణా జిల్లా మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి నిర్మించిన శ్రీశ్రీశ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయంలో నూతన ప్రతిష్ఠా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మంత్రి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజల్లో పాల్గొని భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. వేదమంత్రాల నడుమ స్వామివారి ప్రతిష్ఠా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మే 1న జరగనున్న మహోత్సవాన్ని పురస్కరించుకుని యజ్ఞాలు, యాగాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.