BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:25 PM
143 వీక్షణలు

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వగ్రామం కారకంపూడి ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. బాల త్రిపుర సుందరి సమేత ముకలింగేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తి భావంతో నిండిన వాతావరణంలో ఘనంగా జరిగింది.

వేదమంత్రాల ఘోష, శంఖనాదాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి సాగరంగా మారిపోయింది. మంత్రి పార్థసారథి స్వయంగా పాల్గొని సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ పవిత్ర కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర హేమంత్ కుమార్, చాగంటి రాధా, దారబోయిన రాంబాబు, గడ్డం ధర్మారావు తదితరులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

మొత్తంగా కారకంపూడి గ్రామం ఆ రోజు ఆధ్యాత్మిక ఉత్సవాల వెలుగులతో తళతళలాడుతూ భక్తి ఉత్సాహంతో నిండిపోయింది.