BREAKING
మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం! బూరుగుగూడెంలో ఘనంగా ఆర్సియం చర్చ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు గెడ్డం బుజ్జి సేవలకు ప్రజల్లో ప్రశంసలు ఘనంగా మే డే ఉత్సవాలు – విస్సన్నపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ లక్షెట్టిపేటలో ఘనంగా మేడే వేడుకలు ​లక్సెట్టిపేట రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం
www.ntodaynews.com

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 02:25 PM
50 వీక్షణలు

కారకంపూడిలో భక్తి ఉత్సవాల జోరు… కుంభాభిషేకంతో పరవశించిన గ్రామం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్వగ్రామం కారకంపూడి ఆధ్యాత్మిక శోభతో మెరిసిపోయింది. బాల త్రిపుర సుందరి సమేత ముకలింగేశ్వర స్వామి వారి నూతన ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా, భక్తి భావంతో నిండిన వాతావరణంలో ఘనంగా జరిగింది.

వేదమంత్రాల ఘోష, శంఖనాదాల మధ్య ఆలయ ప్రాంగణం భక్తి సాగరంగా మారిపోయింది. మంత్రి పార్థసారథి స్వయంగా పాల్గొని సంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.

ఈ పవిత్ర కార్యక్రమానికి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర హేమంత్ కుమార్, చాగంటి రాధా, దారబోయిన రాంబాబు, గడ్డం ధర్మారావు తదితరులు హాజరై స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి దర్శనంతో పునీతులయ్యారు.

మొత్తంగా కారకంపూడి గ్రామం ఆ రోజు ఆధ్యాత్మిక ఉత్సవాల వెలుగులతో తళతళలాడుతూ భక్తి ఉత్సాహంతో నిండిపోయింది.