BREAKING
ప్రభుత్వ హాస్పిటల్ చిన్న పిల్లల డాక్టర్ మధుసూదనాచారి చిన్నపిల్లల డాక్టర్ సూచనలు ఇవే ​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్.. ప్రభుత్వ హాస్పిటల్ చిన్న పిల్లల డాక్టర్ మధుసూదనాచారి చిన్నపిల్లల డాక్టర్ సూచనలు ఇవే ​మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద మిన్నంటిన నిరసన: కార్మికుల భారీ సమ్మె ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టిబాబు మరణం ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత ​అద్దె బస్సుల నిర్వహణ.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు- ఏసీపీ హెచ్చరిక రాంనూర్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం మెట్రిక్ టన్నులు టమాటా రావడంతో కనిష్ట ధర పలికింది కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి బ్యాట్ ఈసీ మెంబర్‌గా పుల్లూరి సుధాకర్ ఏకగ్రీవ ఎన్నిక పది దొంగ బైక్‌లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్..
www.ntodaynews.com

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Apr, 2026 - 12:39 PM
10 వీక్షణలు

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి 

50 లక్షల మంది షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే కార్మిక వర్గానికి 15సం॥ నుంచి జీతాలు పెరుగుదల లేదు.!

రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచం.! జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయము,పెన్షన్ ఇవ్వం! ఉన్న జీతాలు తగ్గిస్తాం! ఉద్యోగ భద్రత లేకుండా బానిసల్లాగ పనిచేయించాలనే విధానాన్ని అనుసరిస్తుంది.

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం 

మహాసభల కరపత్రాలు విడుదల చేసిన ఏఐటీయూసీ నాయకులు 

కార్పొరేట్ల లాభాల కోసమే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని ,50 లక్షల మంది షెడ్యూల్డ్ రంగాల్లో పనిచేసే కార్మిక వర్గానికి 15సం॥ నుంచి జీతాలు పెరుగుదల లేదని,రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల జీతాలు పెంచం.! జీవితాంతం పనిచేసినా పర్మినెంట్ చేయము,పెన్షన్ ఇవ్వం! ఉన్న జీతాలు తగ్గిస్తాం! ఉద్యోగ భద్రత లేకుండా బానిసల్లాగ పనిచేయించాలనే విధానాన్ని అనుసరిస్తుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు 

ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దామని బుధవారం పుంగనూరు సివిల్ సప్లయిస్ పాయింట్ వద్ద మహసభల కరపత్రాలు ఏఐటీయూసీ నాయకులు విడుదల చేశారు 

ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ నేడు కార్మిక వర్గం ఎన్నడూ లేనివిధంగా దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని,కార్మికుల కష్టాలను లోతుగా చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలను రూపొందించడానికి ఏఐటీయూసీ 18వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 26 నుంచి 28 వరకు తిరుపతి లో జరుగుతున్నాయన్నారు 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై తీవ్రమైన దాడిని కొనసాగిస్తున్నాయి. లేబర్‌కోడ్స్‌ పేరుతో కార్మికవర్గం వందేళ్ల కిందట సాధించుకున్న హక్కులన్నింటిని కాలరాస్తున్నాయని,కార్మికవర్గాన్ని కట్టు బానిసలుగా మార్చి కార్పొరేట్లకు అధిక లాభాలు చేకూరుస్తున్నాయని,కేంద్ర ప్రభుత్వం శ్రమశక్తి నీతి-2005 అనే డాక్యుమెంటును విడుదల చేసిందన్నారు .దీని ద్వారా ‘శ్రమ చేయడమే    కార్మికుల బాధ్యత.    ప్రతిఫలం    ఆశించరాదు’    అనే కర్మ సిద్ధాంతాన్ని తమ నినాదంగా ప్రకటించిందని తెలిపారు. 

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌, డైలీ వేజ్‌, పీస్‌ రేటు తదితర రేట్ల పేరుతో కార్మికవర్గాన్ని కార్పొరేట్లు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్‌.జి.వో లు, టీచర్లతో సహా అందరూ పి.ఆర్‌.సి. కోసం పడిగాపులు పడుతున్నారని  తెలిపారు .

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పుంగనూరు నియోజకవర్గ కార్యదర్శి వెంకటరమణ రెడ్డి, సీపీఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రాంమూర్తి, హమాలీ వర్కర్స్ రెడ్డప్ప,పళణి,తిరుమలయ్,వీర మణి, విజయ్, గంగాధర్, బాలాజీ,సదాశివ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు