బెస్ట్పల్లిలో ఘనంగా కావమ్మ అమ్మవారి ప్రత్యేక పూజలు
వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. మహిళల కోలాటాలు, భజనలతో ఆధ్యాత్మిక సందడి
రొంపిచర్ల | Ntoday News
చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం మొట్టమల్లెల గ్రామపంచాయతీ పరిధిలోని బెస్ట్పల్లి గ్రామంలో కావమ్మ మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి శ్లోకాలు, భజనలు, కోలాటాలతో భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి స్థానిక నాయకుడు సుందరం ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు సుందరం కుటుంబ సభ్యులు అన్నదానం అందించారు.
కావమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు.