BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

కడియం నర్సరీల్లో కలకలం రేపుతున్న ‘యాసిడ్ పురుగులు’.. కూలీలపై దాడులతో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
28 వీక్షణలు

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఓ వింత పురుగు రైతులు, కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కడియం నర్సరీల్లో గత రెండు నెలలుగా కనిపిస్తున్న ఈ పురుగులు ఇటీవల లక్షల సంఖ్యలో వ్యాపించి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలపై ఈ పురుగులు దాడి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పురుగు శరీరంపై పాకిన ప్రాంతాల్లో పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడి, అగ్నిమంటల మాదిరిగా మంట, దురద వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఈ బొబ్బలు దాదాపు 20 రోజుల వరకు తగ్గడం లేదని వాపోతున్నారు.

రోజువారీ కూలి పనులపైనే జీవనం సాగించే కార్మికులు పనికి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక కూలీలు నర్సరీలకు రావడానికి వెనుకాడటంతో నర్సరీ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వింత ‘యాసిడ్ పురుగుల’ను నియంత్రించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కూలీలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.