BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

కడియం నర్సరీల్లో కలకలం రేపుతున్న ‘యాసిడ్ పురుగులు’.. కూలీలపై దాడులతో ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:42 AM
97 వీక్షణలు

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీల్లో ఓ వింత పురుగు రైతులు, కూలీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన కడియం నర్సరీల్లో గత రెండు నెలలుగా కనిపిస్తున్న ఈ పురుగులు ఇటీవల లక్షల సంఖ్యలో వ్యాపించి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

నర్సరీల్లో పనిచేస్తున్న కూలీలపై ఈ పురుగులు దాడి చేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పురుగు శరీరంపై పాకిన ప్రాంతాల్లో పెద్దపెద్ద బొబ్బలు ఏర్పడి, అగ్నిమంటల మాదిరిగా మంట, దురద వస్తోందని బాధితులు చెబుతున్నారు. ఈ బొబ్బలు దాదాపు 20 రోజుల వరకు తగ్గడం లేదని వాపోతున్నారు.

రోజువారీ కూలి పనులపైనే జీవనం సాగించే కార్మికులు పనికి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఒక్కరోజు పని చేయకపోయినా కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక కూలీలు నర్సరీలకు రావడానికి వెనుకాడటంతో నర్సరీ రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వింత ‘యాసిడ్ పురుగుల’ను నియంత్రించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుని రైతులు, కూలీలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.