BREAKING
అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా
www.ntodaynews.com

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 08:44 AM
117 వీక్షణలు

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కిశోర బాలికలకు, గర్భవతులకు ఉచిత ఆరోగ్య, రక్త పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఏసీడీపీఓ వెంకటమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషకాలు గల ఆహార పదార్థాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదలకు ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం, బాలామృతం ప్లస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ టి. నర్సింగరావు, పీహెచ్ఎన్ జోషి కుమార్, ఎల్‌టీ సుధాకర్, సీఈఓ సుధాకర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సునీత, టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, శోభారాణి, బుజ్జమ్మ, కృష్ణవేణి, మమత, లలిత, జ్యోతి, సునీత, సుజాత, నాగమణి, కిశోర బాలికలు, గర్భవతులు పాల్గొన్నారు.