BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
26 May, 2026 - 08:44 AM
91 వీక్షణలు

కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి NTODAY NEWS చిట్యాల 

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం కిశోర బాలికలకు, గర్భవతులకు ఉచిత ఆరోగ్య, రక్త పరీక్షలు నిర్వహించారు. ఐసీడీఎస్ ఏసీడీపీఓ వెంకటమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ పోషకాలు గల ఆహార పదార్థాల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ​ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా కొబ్బరి నీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదలకు ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం, బాలామృతం ప్లస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం, యోగా చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ టి. నర్సింగరావు, పీహెచ్ఎన్ జోషి కుమార్, ఎల్‌టీ సుధాకర్, సీఈఓ సుధాకర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ సునీత, టీచర్లు దాడి అరుణ, ఎన్. అపర్ణ, శోభారాణి, బుజ్జమ్మ, కృష్ణవేణి, మమత, లలిత, జ్యోతి, సునీత, సుజాత, నాగమణి, కిశోర బాలికలు, గర్భవతులు పాల్గొన్నారు.