కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు
కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు
గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ
రాజమండ్రి | NTODAY News
రాజమండ్రి కలెక్టరేట్లో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్తో చర్చించారు.
దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో కోకో సిటీ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక అభివృద్ధి, స్థానికులకు ఉపాధి అవకాశాల పెంపు అంశాలపై చర్చించారు. అలాగే నల్లజర్లలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు, ఎల్వినో ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలు, నియోజకవర్గంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.
గోపాలపురం నియోజకవర్గంలో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పేర్కొన్నారు.
గోపాలపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.