కమలాపురంలో విషాదం.. పామాయిల్ తోటలో విద్యుత్ షాక్తో కూలీ మృతి
చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కమలాపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పామాయిల్ తోటలో గెలలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్కు గురై ఓ కూలీ మృతి చెందాడు.
కామవరపుకోట మండలం వీరంపాలెం గ్రామానికి చెందిన చవటపల్లి పుల్లయ్య (40) కూలీ పనుల కోసం కమలాపురం గ్రామంలోని కూనప అప్పలరాజుకు చెందిన పామాయిల్ తోటకు వెళ్లాడు. ఈ క్రమంలో పామాయిల్ గెలలు కోస్తుండగా సమీపంలోని విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.
తీవ్ర విద్యుత్ షాక్కు గురైన పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.