BREAKING
ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం ఘనంగా నిర్వహించిన ఆదివాసీల భారీ ర్యాలీ..... గంగా దేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి బోనాల జాతరలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న మాజీ డీసీసీ అధ్యక్షురాలు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం మెగా డీఎస్సీపై వీధి పోరాటాలు విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై రిలే నిరాహార దీక్ష శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు? బండిఆత్మకూరు మండలం పార్నపల్లె లో PGRS నిర్వహించిన కలెక్టర్ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మీ శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ఆడికృత్తిక మహోత్సవం
www.ntodaynews.com

కంటతడి పెట్టుకున్న కేసీఆర్.. పెద్ది కుటుంబాన్ని చూసి భావోద్వేగం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 10:59 AM
18 వీక్షణలు

కంటతడి పెట్టుకున్న కేసీఆర్.. పెద్ది కుటుంబాన్ని చూసి భావోద్వేగం

నల్లబెల్లి: దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించే సమయంలో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం పెద్ది కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సమయంలో పెద్ది సుదర్శన్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. ఆప్తుడిని కోల్పోయిన బాధను తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి తనతో కలిసి పనిచేశారని కేసీఆర్ పలుమార్లు గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పనిచేసిన పెద్ది అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

కుటుంబానికి అండగా ఉంటాం

ఇంటి పెద్దను కోల్పోయిన పెద్ది కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ, తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. పిల్లల చదువులు, భవిష్యత్తు, కుటుంబ సంక్షేమ బాధ్యతలను పార్టీ తరఫున పర్యవేక్షిస్తామని తెలిపారు.

కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్ తరఫున రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. ఆయన ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం చెరో రూ.కోటి చొప్పున, తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం రూ.25 లక్షలు కేటాయించినట్లు సమాచారం.

కేసీఆర్ పరామర్శకు పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానులు తరలివచ్చారు. నల్లబెల్లిలోని పెద్ది నివాసం వద్ద విషాద వాతావరణం నెలకొంది.