www.ntodaynews.com
కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే సూక్ష్మ పట్టుచీర సమర్పణ
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టేంత చిన్న పరిమాణంలో ప్రత్యేక పట్టుచీరను సమర్పించారు.
కేవలం 200 గ్రాముల బరువుతో అత్యంత సూక్ష్మంగా ఈ పట్టుచీరను తయారు చేయడం విశేషంగా నిలిచింది. సిరిసిల్లకు చెందిన చేనేత కళారత్న నల్ల విజయ్ కుమార్ ఈ ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు.
చేనేత కళలోని నైపుణ్యాన్ని వినూత్నంగా ప్రదర్శిస్తూ రూపొందించిన ఈ సూక్ష్మ పట్టుచీర భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది.