www.ntodaynews.com
కొల్లిపర: ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం!
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
కొల్లిపర మండలం సిరిపురం గ్రామంలో బుధవారం సాయంత్రం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. టి. కిషోర్ బాబు (37) అనే రైతు ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా, బ్రేక్ వేయడంతో కాలుజారి కిందపడిపోయాడు. దురదృష్టవశాత్తు, ట్రాక్టర్ చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్దదిక్కును కోల్పోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.