BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 24 March 2026, 05:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 05:46 PM
145 వీక్షణలు

కొండ నాలుకకు మందు వేస్తే… ఉన్న నాలుక ఊడినట్టు!

అవగాహన లోపం, నిర్లక్ష్యం రైతుకు ఎంతటి నష్టాన్ని మిగులుస్తుందో మరోసారి బట్టబయలైంది. గుట్టపాలెం గ్రామానికి చెందిన రైతు గంగిరెడ్డి తీవ్రంగా నష్టపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

బెంగళూరు రోడ్డులోని ఎం.వి.ఆర్ సీడ్స్ & ఫర్టిలైజర్ షాప్‌కు వెళ్లిన గంగిరెడ్డి, తన ఒక ఎకరా టమోటా పంట ఎదుగుదలకు సరైన మందులు ఇవ్వాలని కోరాడు. దుకాణ యజమాని సూచించిన మందులను లీటర్‌కు ₹1400 చొప్పున కొనుగోలు చేసి పంటపై ఉపయోగించాడు.

అయితే, పంట ఎదుగుదల కోసం ఇవ్వాల్సిన మందుల బదులు పంటను కాల్చే రసాయనాలు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా పచ్చగా వున్న టమోటా పంట పూర్తిగా ఎండిపోయి రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు.

ఇది ఒక్క సంఘటన మాత్రమే కాదని, గతంలో కూడా ఇదే దుకాణం వల్ల పలువురు రైతులు ఇబ్బందులు పడినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.

రైతుల డిమాండ్:

దుకాణ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందించాలని రైతులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.