www.ntodaynews.com
కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
తెలంగాణ
/
జగిత్యాల
కొండగట్టులో మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు
మల్యాల (జగిత్యాల):
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 1 నుండి 3వ తేదీ వరకు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. స్వామి వారి చిన్న జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మూడు రోజుల పాటు వేల సంఖ్యలో దీక్షా స్వాములు మాల విరమణ చేయడానికి వచ్చే అవకాశం ఉండటంతో, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్జిత సేవలను రద్దు చేశారు. కేవలం కేశఖండన, మాల విరమణ మరియు ప్రత్యేక దర్శనం సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. తిరిగి ఏప్రిల్ 4వ తేదీ నుండి ఆర్జిత సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. భక్తులు, దీక్షా స్వాములు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.