కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం
కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన
ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం: విత్తన బంతుల విసర్జన
ఎడ్లపాడు మండలం కొండవీడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కొండవీడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో, ABO శ్రీ కె. వెంకటేశ్వరరావు సహకారంతో ఫిరంగిపురం గ్రీన్ వారియర్స్ సభ్యులు ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా హౌస్ గణేష్ కొండలు, కొండవీడు ఘాట్ రోడ్ పరిసర ప్రాంతాలలో నారింజ, చింత, వెలగ, సీతాఫలం, వేప వంటి ఆరు రకాలకు చెందిన సుమారు 650 విత్తన బంతులను ప్రకృతి ప్రేమికులు, సందర్శకులతో కలిసి చల్లారు.ఈ సందర్భంగా గ్రీన్ వారియర్స్ సభ్యులు శౌరి ఫ్రాన్సిస్ మాస్టర్ అందరితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అధికారులు మరియు సభ్యులు శ్రీనివాస్ కార్తీక్, డా. జున్ను సర్ తదితరులు మాట్లాడుతూ రాబోయే తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం, వృక్ష సంపదను పెంచడం ప్రతి పౌరుడి బాధ్యతని, యువత ప్రకృతి సంరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు. 'పచ్చదనం పెంచుదాం – భూమిని కాపాడుదాం' అనే నినాదాలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.