www.ntodaynews.com
కో ఆప్షన్ సభ్యురాలుగా ఎన్నికైన పాటి అరుణదేవి మాధవరెడ్డికి ఘన సన్మానం
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరిగిన కో ఆప్షన్ నెంబర్ల ఎన్నికలు ఏకగ్రీవంగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కోపం సభ్యురాలిగా ఎన్నికైన అరుణ మాధవరెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ కో ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నికైన పాటి అరుణా దేవి మాధవ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. కో ఆప్షన్ సభ్యురాలు ఎన్నికై చిట్యాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయాలని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి ఆంజనేయులు, బిక్కంటి నరేష్ మరియు యూత్ సభ్యులు పాల్గొన్నారు..