కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ
కోడూరు పాఠశాలలో విద్యార్థులకు దస్తూరిపై ప్రత్యేక శిక్షణ
విద్యార్థుల్లో చక్కటి చేతిరాతను పెంపొందించే లక్ష్యంతో ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం కోడూరు మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో దస్తూరిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వరుసగా రెండో ఏడాది ఉచితంగా ఈ శిక్షణ అందిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం. రాం ప్రదీప్ శనివారం తెలిపారు.
చేతిరాత నిపుణులు యం. మధు విద్యార్థులకు దస్తూరిపై మెళకువలను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. అక్షరాల ఆకృతి, స్పష్టత, వేగంగా రాయడం వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన 84 మంది విద్యార్థులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. విద్యార్థుల చదువులో దస్తూరి కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.