BREAKING
గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు గంటిపెదపూడి–ఉడుముడిలంక బ్రిడ్జి పనులు వెంటనే పూర్తి చేయాలి.. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు
www.ntodaynews.com

కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు..!

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 11:36 AM
20 వీక్షణలు

కూలిపోయిందని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రైతులకు సాగునీరు..!

తెలంగాణలో ఒకప్పుడు "కూలిపోయింది", "వృథా ప్రాజెక్టు" అంటూ విమర్శలు ఎదుర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే ప్రస్తుతం రైతులకు సాగునీరు అందుతోంది. గతంలో కాళేశ్వరం రివర్స్ పంపింగ్ విధానాన్ని తీవ్రంగా విమర్శించిన ప్రభుత్వమే ఇప్పుడు అదే పద్ధతిని అమలు చేస్తుండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

SRSP వరద కాలువలోని రాంపూర్ పంప్‌హౌస్ మోటార్లను ప్రారంభించి, కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలను రివర్స్ పంపింగ్ విధానంలో ఎత్తిపోస్తున్నారు. ఈ నీటిని SRSP వరద కాలువకు తరలించడం ద్వారా సుమారు 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది.

గతంలో ఈ విధానాన్ని వ్యతిరేకించినవారే ఇప్పుడు రైతుల ప్రయోజనాల కోసం అదే సాంకేతికతను వినియోగించడం గమనార్హమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం, సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది. రైతులకు నీటి సరఫరా కొనసాగుతుండటంతో సాగు పనులు ఊపందుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.