కూటమి ప్రభుత్వ వెన్నుపోటుకు రెండేళ్ల సందర్భంగా వైఎస్సర్ సిపి పార్టీ నాయుకుల నిరసన..
అన్నమయ్య జిల్లా పుంగనూరు సూపర్ సిక్స్,బాండ్స్ మరియు మేనిఫెస్ట్ లను తగలబెట్టి నిరసన తెలిపారు.
బాబు మాటలు మొత్తం బూటకమే రెండేల్ల పరిపాలనలో ప్రజలు మోసపోయారు.
రాష్ట్ర ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వంపై నిరసన తెలపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు
ఈ నేపధ్యంలో మాజీ మంత్రి,పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు
పుంగనూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ లో వైయస్సార్ విగ్రహం వద్ద కూటమి నాయకులు ఇచ్చిన సూపర్ సిక్స్,బాండ్స్ మరియు మేనిఫెస్ట్ లను తగలబెడుతూ నిరసన తెలిపారు.
ఈ సందర్బంగా వైఎస్సార్ సిపి నాయకులు మాట్లాడుతు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఇప్పటివరకు మహిళలకు చెప్పిన పథకాలు ఏవి అమలు కాలేదని, నిరుద్యోగ ఉపాధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ప్రజలకు గడిచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం మోసం చేసిందని రాబోయే ఎన్నికలలో ప్రజలు వైఎస్ఆర్సిపి పార్టీకి ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డి తిరిగి సీఎంగా వస్తారని అన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ మున్సిపల్ చైర్మన్ లు,ఎంపీపీ, జడ్పిటిసి,మాజీ ప్రజా ప్రతినిధులు మండల మరియు పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.