BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

కోటపాడులో కోడి పందాల స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:34 PM
52 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం కోటపాడు గ్రామ శివారులో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. నూజివీడు డీఎస్పీ కెవీవీఎన్వీ ప్రసాద్, నూజివీడు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఐవి నాగేంద్ర కుమార్ ఆదేశాల మేరకు చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు.

దాడిలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 4 కోడి పుంజులు, 2 కోడి కత్తులు, రూ.4,400 నగదు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చాట్రాయి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలను ఆర్థికంగా నష్టపరిచే జూద క్రీడలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. జూదాన్ని ప్రోత్సహించే వారు లేదా పాల్గొనే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూద కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.