www.ntodaynews.com
కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ బస్సు ఆపి డ్రైవర్ తమ్ముడికి రాఖీ కట్టిన అక్క..
తెలంగాణ
/
కరీంనగర్
రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి చక్కని నిదర్శనంగా నిలిచిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు డ్రైవర్ మెండ రాజుకు తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద అక్క తమ్మనవేణి స్వప్న రాఖీ కట్టింది.
తమ్ముడు రాజు విధుల్లో ఉండటంతో రేణికుంటకు చెందిన స్వప్న రాజీవ్ రహదారిపై బస్సును ఆపించి రాఖీ కట్టి ఆశీర్వదించింది. విధి నిర్వహణలో ఉన్న తమ్ముడి వద్దకు వెళ్లి రాఖీ కట్టిన అక్క ప్రేమను చూసి పలువురు అభినందించారు.