కృష్ణారావుపాలెంలో అభివృద్ధికి శ్రీకారం చాట్రాయి మండల టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు చిమటబోయిన పుల్లారావు
చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం కృష్ణారావుపాలెం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు చిమటబోయిన పుల్లారావు తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారధి సహకారంతో గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా కృష్ణారావుపాలెం గ్రామంలో మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలిపారు. రహదారి సౌకర్యం మెరుగుపడటంతో గ్రామస్థుల రాకపోకలకు ఇబ్బందులు తొలగనున్నాయని అన్నారు. గ్రామ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో మంత్రి కొలుసు పార్థసారధి సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి కృష్ణారావుపాలెంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు చిమటబోయిన పుల్లారావు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.