BREAKING
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ
www.ntodaynews.com

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:11 PM
98 వీక్షణలు

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు? — పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడింది సామాన్య కార్యకర్తేనని అన్నారు. అధికారం దరిదాపుల్లో లేని రోజుల్లో జెండా మోసింది కూడా అతడేనని పేర్కొన్నారు.

అయితే, ఈరోజు అధికారం రాగానే ఎక్కడో నుంచి వచ్చిన వారు వెన్నుముక్కలా నటిస్తుండటంతో అసలైన కార్యకర్త గుండె రగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడేవారికి ఒక నీతి, అవకాశవాదులకు మరో నీతి ఎందుకని ప్రశ్నించారు.

ఎవరికీ తెలియని వ్యక్తులను తీసుకువచ్చి కార్యకర్తలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు.

నిన్నటి వరకు వైసీపీలో ఉండి, ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పదవులు పంచడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల కంటే, ఫోన్ కాల్స్‌లో వచ్చే అజ్ఞాత అభిప్రాయాలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అని ప్రశ్నించారు.

అధిష్టానం నమ్మకమైన కేడర్‌ను పక్కనపెట్టి అవకాశవాదులకు పెద్దపీట వేస్తే రేపు పార్టీకి అండగా నిలిచే బలం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.