BREAKING
జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా
www.ntodaynews.com

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:11 PM
139 వీక్షణలు

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు? — పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడింది సామాన్య కార్యకర్తేనని అన్నారు. అధికారం దరిదాపుల్లో లేని రోజుల్లో జెండా మోసింది కూడా అతడేనని పేర్కొన్నారు.

అయితే, ఈరోజు అధికారం రాగానే ఎక్కడో నుంచి వచ్చిన వారు వెన్నుముక్కలా నటిస్తుండటంతో అసలైన కార్యకర్త గుండె రగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడేవారికి ఒక నీతి, అవకాశవాదులకు మరో నీతి ఎందుకని ప్రశ్నించారు.

ఎవరికీ తెలియని వ్యక్తులను తీసుకువచ్చి కార్యకర్తలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు.

నిన్నటి వరకు వైసీపీలో ఉండి, ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పదవులు పంచడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల కంటే, ఫోన్ కాల్స్‌లో వచ్చే అజ్ఞాత అభిప్రాయాలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అని ప్రశ్నించారు.

అధిష్టానం నమ్మకమైన కేడర్‌ను పక్కనపెట్టి అవకాశవాదులకు పెద్దపీట వేస్తే రేపు పార్టీకి అండగా నిలిచే బలం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.