BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు?

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Apr, 2026 - 09:11 PM
68 వీక్షణలు

కష్టపడింది కార్యకర్తే… ఫలితం మరొకరికి ఎందుకు? — పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పోరాడింది సామాన్య కార్యకర్తేనని అన్నారు. అధికారం దరిదాపుల్లో లేని రోజుల్లో జెండా మోసింది కూడా అతడేనని పేర్కొన్నారు.

అయితే, ఈరోజు అధికారం రాగానే ఎక్కడో నుంచి వచ్చిన వారు వెన్నుముక్కలా నటిస్తుండటంతో అసలైన కార్యకర్త గుండె రగులుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడేవారికి ఒక నీతి, అవకాశవాదులకు మరో నీతి ఎందుకని ప్రశ్నించారు.

ఎవరికీ తెలియని వ్యక్తులను తీసుకువచ్చి కార్యకర్తలపై రుద్దడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. ఇది కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నారు.

నిన్నటి వరకు వైసీపీలో ఉండి, ఈరోజు టీడీపీ సభ్యత్వం తీసుకున్న వారి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా పదవులు పంచడం సరైన విధానం కాదని అభిప్రాయపడ్డారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తల కంటే, ఫోన్ కాల్స్‌లో వచ్చే అజ్ఞాత అభిప్రాయాలకు అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందా అని ప్రశ్నించారు.

అధిష్టానం నమ్మకమైన కేడర్‌ను పక్కనపెట్టి అవకాశవాదులకు పెద్దపీట వేస్తే రేపు పార్టీకి అండగా నిలిచే బలం తగ్గిపోతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయి వాస్తవాలను గమనించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు.