www.ntodaynews.com
కుదపలో సర్వే నం. 442పై పీజీఆర్ఎస్ అర్జీకి ఫీల్డ్ పరిశీలన
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం కుదప రెవెన్యూ గ్రామంలో వివాదంలో ఉన్న సర్వే నంబర్ 442పై దాఖలైన పీజీఆర్ఎస్ అర్జీపై తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమార్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.
ఈ పరిశీలనలో డిప్యూటీ తహసీల్దార్, మండల సర్వేయర్, గ్రామ రెవెన్యూ అధికారి మరియు గ్రామ సర్వేయర్ పాల్గొన్నారు. వివాదాస్పద స్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి సంబంధిత రికార్డులు, సరిహద్దు వివరాలు సేకరించారు. తదుపరి చర్యల కోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.