కుప్పం మండలంలో శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో మహాకుంభాభిషేకం
కుప్పం మండల పరిధిలోని జరుగు, గుడ్లనాయనిపల్లి, పోరకుంట్లపల్లి, యానామానాశనపల్లి, చల్లర్లపల్లి గ్రామాల్లో భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తున్న శ్రీ కోడెల్లారాయస్వామి నూతన దేవస్థానంలో సోమవారం (23.04.2026) మహాకుంభాభిషేక కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాలయ కమిటీ మరియు ధర్మకర్తలు తెలిపారు.
ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు పాల్గొననున్న ఈ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మహాకుంభాభిషేకం సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు