క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం
క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్-సీపీఐ కూటమి కైవసం
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి చెక్ పెడుతూ బీఆర్ఎస్, సీపీఐ కూటమి ఘనవిజయం సాధించింది. గతంలో మంత్రి వివేక్ మరియు కాంగ్రెస్ నేతల జోక్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ ఎన్నికల ప్రక్రియ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యూహాత్మక చొరవతో ముగియగా, మున్సిపల్ చైర్పర్సన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ గోడిశెల సంధ్యారాణి, వైస్ చైర్పర్సన్గా సీపీఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత ఎన్నికయ్యారు. మొత్తం 22 వార్డులకు గాను బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డుల్లో విజయం సాధించి స్పష్టమైన బలంతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోగా, కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 7 స్థానాలకే పరిమితమయ్యారు. దీంతో క్యాతన్పల్లి మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది