BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

లైసెన్స్‌, అమెండ్మెంట్లు లేని డీలర్లపై కఠిన చర్యలు -విస్సన్నపేట మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:25 PM
125 వీక్షణలు

ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేట మండలం కలగర గ్రామంలోని ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలను మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా షాపుల్లో నిర్వహిస్తున్న స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించి, నూతనంగా సర్టిఫై చేశారు. పాత స్టాక్స్‌కు సంబంధించిన ఎంట్రీలు, విక్రయ రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

డీలర్లందరూ తమ లైసెన్సులు, ఓ-ఫారమ్‌లు, ఇతర అవసరమైన అమెండ్మెంట్లు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఆమె ఆదేశించారు. లైసెన్స్‌ లేదా అమెండ్మెంట్లు లేకుండా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల విక్రయాలు నిర్వహిస్తే సంబంధిత డీలర్లపై ఎరువులు, పురుగుమందులు మరియు విత్తనాల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందేలా అధికారులు నిరంతరం తనిఖీలు కొనసాగిస్తారని మండల వ్యవసాయాధికారి తెలిపారు.