BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

లెక్చరర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు : కళాశాల ఎదుట ఆందోళన

తెలంగాణ
/ నల్గొండ / దేవరకొండ
18 Aug, 2026 - 01:59 PM
16 వీక్షణలు

లెక్చరర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు : కళాశాల ఎదుట ఆందోళన

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ లెక్చరర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం దేవరకొండలో కలకలం రేపింది. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్ ఓ విద్యార్థినిని కొంతకాలంగా అసభ్యకరంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

బాధిత విద్యార్థిని ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థినుల దృష్టికి తీసుకెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో కళాశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట బైఠాయించి లెక్చరర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కళాశాల ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయంలో ఉన్న లెక్చరర్ భాస్కర్‌ను కొందరు ఆందోళనకారులు పట్టుకుని దాడి చేసినట్లు సమాచారం. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

విద్యార్థినుల భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, నిజాలు తేలితే బాధ్యుడిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కళాశాలల్లో విద్యార్థినులకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.