లింగపాలెంలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు
లింగపాలెం, సెప్టెంబర్ 2: ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు అన్నపునేని శాంతారావు ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి గంగాజలంతో జలాభిషేకం నిర్వహించారు.
అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్), చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జి కంభం విజయరాజు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల కోసం పనిచేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.