www.ntodaynews.com
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
లక్సెట్టిపేట: కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
లక్సెట్టిపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్. లక్సెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక తహశీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్యతో కలిసి ఆయన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రతి ధాన్యం గింజలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఉన్నారు.