BREAKING
చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ.. చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ మంచిర్యాలలో ఘనంగా మే డే ప్రైవేట్ విద్యాసంస్థల సిబ్బంది హక్కుల కోసం ఐక్యపోరాటం కంటాయపాలెం గ్రామానికి ఆర్థిక సాయం అందిస్తున్న శ్రీశైలం పౌర్ణమి సందర్భంగా శ్రీశైల దేవస్థానం గిరిప్రదక్షిణ కార్యక్రమం నంద్యాల పెన్షన్ పండుగ కార్యక్రమం లో TDP జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలిమినేడు ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ మే డే శుభాకాంక్షలు..... ​మంచిర్యాలలో ‘దివాకర్ అన్న పెరుగన్నం’ కేంద్రం ప్రారంభం దెందులూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పండుగ..
www.ntodaynews.com

లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:40 PM
13 వీక్షణలు

గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా… జిల్లా దృష్టిని ఆకర్షించిన ఫలితాలు! 

విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాప్ స్కోర్ నమోదు చేయడంతో పాటు, పలు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.

లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే స్థాయిలో రాణించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకటి రెండు ర్యాంకులకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సవాలు నిర్వహించారు. డప్పులు, ఊరేగింపుతో పాఠశాల పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి.

ఉచిత విద్యతో పాటు మెరుగైన బోధన అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రభుత్వ విద్యపై ఉన్న అపోహలకు ఈ ఫలితాలు గట్టి సమాధానంగా నిలిచాయి.