BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:40 PM
60 వీక్షణలు

గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా… జిల్లా దృష్టిని ఆకర్షించిన ఫలితాలు! 

విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాప్ స్కోర్ నమోదు చేయడంతో పాటు, పలు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.

లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే స్థాయిలో రాణించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకటి రెండు ర్యాంకులకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సవాలు నిర్వహించారు. డప్పులు, ఊరేగింపుతో పాఠశాల పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి.

ఉచిత విద్యతో పాటు మెరుగైన బోధన అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రభుత్వ విద్యపై ఉన్న అపోహలకు ఈ ఫలితాలు గట్టి సమాధానంగా నిలిచాయి.