BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

లక్షల ఫీజులకు చెక్ పెట్టిన గవర్నమెంట్ స్కూల్!

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 12:40 PM
34 వీక్షణలు

గాజువాక నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా… జిల్లా దృష్టిని ఆకర్షించిన ఫలితాలు! 

విశాఖ జిల్లా గాజువాక ప్రాంతంలోని నడుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈసారి పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 592 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో టాప్ స్కోర్ నమోదు చేయడంతో పాటు, పలు మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం ప్రత్యేకంగా నిలిచింది.

లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ స్కూళ్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అదే స్థాయిలో రాణించడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఒకటి రెండు ర్యాంకులకే పరిమితం కాకుండా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నత మార్కులు సాధించడం ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకాన్ని మరింత పెంచింది.

ఈ విజయాన్ని పురస్కరించుకుని పాఠశాల వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఆనందోత్సవాలు నిర్వహించారు. డప్పులు, ఊరేగింపుతో పాఠశాల పరిసరాలు ఉత్సాహభరితంగా మారాయి.

ఉచిత విద్యతో పాటు మెరుగైన బోధన అందిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన బాట వేస్తున్న ప్రభుత్వ పాఠశాలలు మరోసారి తమ సత్తా చాటాయి. ప్రభుత్వ విద్యపై ఉన్న అపోహలకు ఈ ఫలితాలు గట్టి సమాధానంగా నిలిచాయి.