www.ntodaynews.com
లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
లోక్ అదాలత్ ద్వారా ఎక్సైజ్ కేసుల పరిష్కారానికి అవకాశం
నూజివీడు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గతంలో అనధికార మద్యం వ్యాపారం, బెల్ట్ షాపులు నిర్వహించిన వారిపై నమోదైన కేసులను వచ్చే లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం జి.ఓ జారీ చేసిన విషయాన్ని సంబంధిత ముద్దాయిలకు తెలియజేశారు.
పట్టుబడిన మద్యం సీసాల విలువకు మూడు రెట్లు జరిమానాను ప్రభుత్వ ఖజానాకు చలానా రూపంలో చెల్లించడం ద్వారా తమ కేసులను సెటిల్ చేసుకోవచ్చని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య వెల్లడించారు.
లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముద్దాయిలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు.