www.ntodaynews.com
లోకేష్ మామ.. మాకు బస్సు కావాలి!
ఆంధ్రప్రదేశ్
తిరుపతి కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల నిరసన
తిరుపతి కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం నిరసన చేపట్టారు. పుత్తూరు నుంచి ఎస్బీఆర్పురం వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వ హయాంలో నడిచిన ఆర్టీసీ బస్సు సేవలను ప్రస్తుతం నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
"లోకేష్ మామ.. మాకు బస్సు కావాలి" అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు, ఉచిత బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యపై అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.