BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:21 pm
Posted by : M. రాజశేఖర్

పర్యావరణాన్ని కాపాడుదాం.. భవిష్యత్తును రక్షించుకుందాం

ఆంధ్రప్రదేశ్
Reporter
M. రాజశేఖర్ కుప్పం రూరల్ రిపోర్టర్
19 Sep, 2026 - 06:21 PM
10 వీక్షణలు

కుప్పం: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రాథమిక వైద్యశాల ఎన్.కొత్తపల్లి వైద్యాధికారి డాక్టర్ సుభాష్ రాజా అన్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు.

డాక్టర్ సుభాష్ రాజా ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, స్టాఫ్ నర్సులు, సూపర్‌వైజర్, ఇతర సిబ్బంది కలిసి మొక్కలు నాటారు. అనంతరం పరిసరాల పరిశుభ్రత, మొక్కల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి, దానిని బాధ్యతగా సంరక్షించాలని కార్యక్రమంలో సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఇంటి పరిసరాలు, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవచ్చని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.