మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు
మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లేల గ్రామంలోని పరిశుద్ధ పౌలు సీఎస్ఐ దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.
సంఘం సభ్యులంతా పాల్గొని, సర్వ మానవాళి పాప పరిహారార్థం, మానవుల రక్షణ కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిలువను మోసుకుంటూ గ్రామంలోని ప్రధాన వీధులలో ప్రదర్శనగా తీసుకెళ్లుతూ, ఆయన పాపుల కొరకు చేసిన త్యాగాన్ని వివరిస్తూ సిలువ మార్గం నిర్వహించారు.
తదనంతరం దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో స్థానిక గురువులు రెవరెండ్ గంటా రాకేష్ దేవ్ వాక్యోపదేశం చేశారు. అలాగే రెవరెండ్ దేవానందం ప్రార్థనలు నిర్వహించారు.
గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, సంఘస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, మహిళల మైత్రి సభ్యులు, యువజనులు, పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.