BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:33 AM
97 వీక్షణలు

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లేల గ్రామంలోని పరిశుద్ధ పౌలు సీఎస్ఐ దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

సంఘం సభ్యులంతా పాల్గొని, సర్వ మానవాళి పాప పరిహారార్థం, మానవుల రక్షణ కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిలువను మోసుకుంటూ గ్రామంలోని ప్రధాన వీధులలో ప్రదర్శనగా తీసుకెళ్లుతూ, ఆయన పాపుల కొరకు చేసిన త్యాగాన్ని వివరిస్తూ సిలువ మార్గం నిర్వహించారు.

తదనంతరం దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో స్థానిక గురువులు రెవరెండ్ గంటా రాకేష్ దేవ్ వాక్యోపదేశం చేశారు. అలాగే రెవరెండ్ దేవానందం ప్రార్థనలు నిర్వహించారు.

గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, సంఘస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, మహిళల మైత్రి సభ్యులు, యువజనులు, పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.