BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 04 April 2026, 07:33 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:33 AM
132 వీక్షణలు

మల్లేలలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరు మండలం మల్లేల గ్రామంలోని పరిశుద్ధ పౌలు సీఎస్ఐ దేవాలయంలో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి.

సంఘం సభ్యులంతా పాల్గొని, సర్వ మానవాళి పాప పరిహారార్థం, మానవుల రక్షణ కొరకు సిలువపై తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సిలువను మోసుకుంటూ గ్రామంలోని ప్రధాన వీధులలో ప్రదర్శనగా తీసుకెళ్లుతూ, ఆయన పాపుల కొరకు చేసిన త్యాగాన్ని వివరిస్తూ సిలువ మార్గం నిర్వహించారు.

తదనంతరం దేవాలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో స్థానిక గురువులు రెవరెండ్ గంటా రాకేష్ దేవ్ వాక్యోపదేశం చేశారు. అలాగే రెవరెండ్ దేవానందం ప్రార్థనలు నిర్వహించారు.

గ్రేస్ అమ్మ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు ధ్యానిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, సంఘస్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సండే స్కూల్ పిల్లలు, మహిళల మైత్రి సభ్యులు, యువజనులు, పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.