BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 05:26 PM
21 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలో అకాల గాలి, వర్షం బీభత్సంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని కౌలు రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల అధ్యక్షుడు, కార్యదర్శి గద్దల రామకృష్ణ మాట్లాడుతూ ఏప్రిల్ 30న కురిసిన అకాల వర్షాల కారణంగా విస్తృతంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయని తెలిపారు.

ఎకరానికి రూ.50 వేలకుపైగా పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. మామిడి తోటలను కూడా పంట నష్ట పరిధిలోకి తీసుకుని ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

రైతు సంఘం నాయకుడు పులిబళ్ల ఏడుకొండలు మాట్లాడుతూ, మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని, ఆలస్యం చేస్తే రైతులు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.