BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:27 PM
135 వీక్షణలు

అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నేపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న చిన్నారి అపహరణ యత్నం ఘటనపై గుత్తి సీఐ రామారావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

గ్రామానికి చెందిన గొల్ల నారాయణస్వామి కుమారుడు హేమతేజ(2) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాలుడి తల్లి లలిత వెంటనే అప్రమత్తమై బాబును లాక్కోవడంతో, ఆ వ్యక్తి ఆమెతో పెనుగులాటకు దిగాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలినట్లు సీఐ రామారావు తెలిపారు. గత రెండు రోజులుగా మార్నేపల్లి క్రాస్‌, ఐఓసీ పెట్రోల్ బంక్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు, ఉపాధి హామీ కూలీలు గుర్తించినట్లు చెప్పారు.

ఈ ఘటనను కిడ్నాప్ ప్రయత్నంగా భావించాల్సిన అవసరం లేదని, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆ వ్యక్తి అలా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ స్పష్టం చేశారు.