BREAKING
మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం మిల్లింగ్ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి--జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి జర్నలిజం విలువలు కాపాడాలి… సమాజాన్ని మార్చే శక్తిగా మీడియా నిలవాలి ప్రజలకు తాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలి --జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు తోటపల్లిలో 11/33 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌కు నేడు శంకుస్థాపన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా జిల్లాలో యువజన వారోత్సవాలు--యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు ​జాతీయ డెంగ్యూ దినోత్సవం: కలెక్టరేట్‌లో పోస్టర్ల ఆవిష్కరణ ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ... చౌటుప్పల్ మున్సిపాలిటీలో తాగునీటి సరఫరాపై అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం
www.ntodaynews.com

మార్నేపల్లి ఘటనలో కిడ్నాప్ కోణం లేదన్న సీఐ రామారావు

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:27 PM
14 వీక్షణలు

అనంతపురం జిల్లా గుత్తి మండలం మార్నేపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకున్న చిన్నారి అపహరణ యత్నం ఘటనపై గుత్తి సీఐ రామారావు మీడియాకు వివరాలు వెల్లడించారు.

గ్రామానికి చెందిన గొల్ల నారాయణస్వామి కుమారుడు హేమతేజ(2) ఇంటి వద్ద ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తి బాబును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. దీనిని గమనించిన బాలుడి తల్లి లలిత వెంటనే అప్రమత్తమై బాబును లాక్కోవడంతో, ఆ వ్యక్తి ఆమెతో పెనుగులాటకు దిగాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పోలీసుల విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తిగా తేలినట్లు సీఐ రామారావు తెలిపారు. గత రెండు రోజులుగా మార్నేపల్లి క్రాస్‌, ఐఓసీ పెట్రోల్ బంక్ పరిసరాల్లో తిరుగుతున్నట్లు స్థానికులు, ఉపాధి హామీ కూలీలు గుర్తించినట్లు చెప్పారు.

ఈ ఘటనను కిడ్నాప్ ప్రయత్నంగా భావించాల్సిన అవసరం లేదని, మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఆ వ్యక్తి అలా ప్రవర్తించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. గ్రామస్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పోలీసులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు సీఐ స్పష్టం చేశారు.