BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మే 11న సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
09 May, 2026 - 02:57 PM
130 వీక్షణలు

మే 11న  సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్  శ్రీశైలం లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులవ్వండి. చైర్మన్ రమేశనాయుడు, EO

కార్యనిర్వహణాధికారివారి కార్యాలయం

 మే 11న  సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్

సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా మే 11వ తేదీన దేవస్థానంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలియజేశారు. 

సోమనాథ ఆలయంపై దాడి జరిగి 1000 సంవత్సరాలు మరియు దాని పునర్నిర్మాణం జరిగి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా భారతప్రభుత్వ సాంస్కృతికశాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరున పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు.  

ఇందులో భాగంగా రాష్ట్ర దేవదాయశాఖ ఉత్తర్వుల మేరకు మే 11వ తేదీన శ్రీశైలదేవస్థానంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఈసందర్భంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లుగా వారు తెలియజేశారు.  ఇందులో భాగంగానే  మే 11 వ తేదీన ఉదయం గం. 7.00ల నుంచి గంగాధరమండపం వద్ద కలశయాత్ర ఉంటుందన్నారు.  గంగాధరమండపం ప్రారంభమయ్యే ఈ కలశయాత్ర నందిమండపం వరకు,  అక్కడి నుంచి మల్లికార్జునసదన్‌ మీదుగా బయలువీరభద్రస్వామి ఆలయం వరకు మరియు అక్కడి నుంచి తిరిగి గంగాధర మండపం వరకు ఈ కలశయాత్ర నిర్వహించబడుతుందన్నారు. అనంతరం పంచాక్షరీ మంత్రలేఖనానికి భక్తులకు పుస్తకాలను అందజేయడం జరుగుతుందన్నారు. 

తరువాత గంగాధర మండపం వద్ద గల ఏర్పాటు చేయనున్న వేదికపై గం. 10.00లకు ఎల్.ఈ.డి స్క్రీన్ నందు జాతీయ కార్యక్రమ ప్రదర్శన ఉంటుందన్నారు. 

కాగా సాయంకాలం గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేయనున్న వేదిక వద్దనే  గం.5.30ల నుంచి శివభజనలు, భక్తిరంజని కార్యక్రమాలు ఉంటాయన్నారు. తరువాత సాయంత్రం గం. 6.30లకు ఓంకారం ప్రాశస్త్యంపై ధార్మిక ప్రవచనం అనంతరం ఓంకార మంత్రజపం ఉంటుందన్నారు.  కార్యక్రమం అనంతరం రాత్రి గం. 7.30ల నుంచి పేరిణి శివతాండవం ప్రదర్శన ఉంటుందన్నారు.

కావున  భక్తులందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారివారు తెలియజేశారు. 


 ( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ