మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం
మే 1న గిరిప్రదక్షిణ మహోత్సవం… భక్తులకు ఆహ్వానం
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో మే 1వ తేదీ (శుక్రవారం) ఉదయం 7:00 గంటలకు గిరిప్రదక్షిణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నిబోయిన శ్రీనివాసులు, ఈఓ కృష్ణవేణి సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.
పవిత్రమైన ఈ గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తులు స్వామివారి అనుగ్రహం పొందే అపూర్వ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఉదయం వేళలో ప్రారంభమయ్యే ఈ మహోత్సవంలో భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదించాలని సూచించారు.
మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. గిరిప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.