మే 29-31 తేదీల్లో యాదగిరిగుట్టలో వికలాంగుల చట్టలపై రాష్ట్ర సదస్సు
NPRD రాష్ట్ర అధ్యక్షుడు కురునేల్లి వెంకట్
సుందరయ్య భవన్ భువనగిరి: కురునేల్లి వెంకట్ మాట్లాడుతూ వికలాంగుల హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరస్తున్నాయని అన్నారు. పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులు అమలు కావడం లేదని అన్నారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, ఐక్య రాజ్య సమితి హక్కుల ఒప్పంద పత్రం, నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్, మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెన్షన్ పెంపుకోసం వికలాంగులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు.ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కార్యాలయాల్లో ర్యాంపులు నిర్మించాలని డిమాండ్ చేశారు.వికలాంగులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు రక్షణ లేకుండా పోతుందని అన్నారు.స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.వికలాంగులకు సహాయ పరికరాలు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు. వికలాంగుల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు.మే 29-31 తేదీల్లో భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో వికలాంగుల చట్టలపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని విజయవంతం చేయాలని పిలుపు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సురూపంగ ప్రకాష్, కార్యదర్శి వనం ఉపేందర్, కోశాధికారి లలిత, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, పాoడాల శ్రీహరి పాల్గొన్నారు