మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక
మే 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాధవరం రాక .పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
09-05-2026న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ.కొండూరు మండలం మాధవరం గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడనుంది. రైతుల భూమి హక్కులకు మరింత బలం చేకూర్చే ఈ చారిత్రక కార్యక్రమం ప్రభుత్వ సంక్షేమ దృఢతకు నిదర్శనంగా నిలవనుంది. ఈ నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి సంకల్పానికి బలమైన మద్దతు తెలియజేయాలని ఎన్టీఆర్ భవన్, విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నుంచి పిలుపు ఇచ్చారు. రైతు భద్రత, భూమి హక్కుల పునరుద్ధరణ దిశగా జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచే కీలక ఘట్టంగా నిలవనుంది.