BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
01 May, 2026 - 03:15 PM
118 వీక్షణలు

మే డే స్ఫూర్తితో బలమైన కార్మికోధ్యమాన్ని నిర్మిద్దాం!

మే డే సందర్భంగా సిపిఐ నేత డా. టి జనార్ధన్ పిలుపు...

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ఉద్యోగ వ్యతి రేక విధానాలను ప్రతిఘటిస్తూ" మేడే" స్పూర్తితో బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యులు  డాక్టర్ టి. జనార్ధన్ పేర్కొన్నారు. మేడే ని పురస్కరించుకొని పుంగనూరు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్, హమాలి వర్కర్స్ యూనియన్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్, ఆటో యూనియన్, భగత్ సింగ్ కాలనీలో సిపిఐ కార్యాలయం వద్ద ఎర్రజెండాలు ఎగరేశారు. ఈ సందర్భంగా కార్మికుల ఉద్దేశించి సిపిఐ నేత టీ. జనార్దన్ మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులు సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించుకున్న హక్కులు, చట్టాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తూ కార్మిక వ్యతిరేక చర్యలకు ప్రభుత్వాలు పాల్పడుతున్నారని చేయబడ్డారు. కార్మికులను సాధించుకున్న పలు చట్టాలను కుదించి వేయడం నిర్వీర్యం చేయడం, కార్మికులపై ఉక్కు పాదం మోపే చర్యలకు పాల్పడుతూ కార్పొరేట్లకు వంత పాడడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. ఇప్పటికే పని గంటలు మే డే స్ఫూర్తికి భిన్నంగా 8 నుండి 10 -12 గంటలకు పలు సంస్థలు పెంచుతున్నా  ప్రేక్షక పాత్ర వహించడం, ప్రభుత్వ చేతకాని తనానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఉద్యోగ, కార్మికులకు సక్రమంగా పిఆర్సి అమలు చేయకపోవడం, కరువు భత్యం చెల్లింపు విషయంలో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వ కార్మిక వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో ఉద్యోగుల కనీస వేతనాల కోసం, కనీస వసతులు కల్పనకై, కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ ఐ వంటివి అందజేయడం, పుంగనూరు పట్టణంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణం కోసం కార్మికులందరినీ ఏకతాటి మీద కలుపుకుని భవిష్యత్ ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐటీయూసీ కార్యదర్శి పివి రెడ్డి మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో కార్మికులందరూ ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కె.రామ్మూర్తి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు సి. శ్రీరాములు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మరియు సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి మూన్నా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు నరేందర్ రెడ్డి, ఎస్ పి,బాబు రమణ, గౌరీ శంకర్, స్వామి శివారెడ్డి, హమాలీ వర్కర్స్ నేతలు వెంకటేష్,సూరి, రామనాథ , సుధాకర్,మునిస్వామి,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు ఆర్ శ్రీరాములు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు, పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోకుల్ సర్కిల్ వద్ద హమాలి యూనియన్ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు.