మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే
మేడే సందేశంలో కార్మికుల గొప్పతనాన్ని చాటి చెప్పిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— దేశ అభివృద్ధి చక్రాన్ని ముందుకు నడిపించే అసలైన శక్తి కార్మికులేనని స్పష్టం చేశారు. చెమట చిందించి దేశాన్ని నిర్మిస్తున్న కార్మికుల కష్టానికి సరితూగే గౌరవం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
సమాజ ప్రగతికి పునాది వేసేది కార్మికుల కఠోర శ్రమేనని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్మికుల హక్కులను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, వారి జీవితాల్లో మరింత వెలుగు నింపేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ మేడే సందర్భంగా కార్మికుల ఐక్యత మరింత బలపడాలని, ప్రతి కార్మికుడి జీవితం సంతోషంతో నిండాలని ఆకాంక్షించారు.