BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:38 PM
50 వీక్షణలు

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

“ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!” అనే నినాదాలతో మేడే ఉత్సాహం రాష్ట్రమంతా మార్మోగింది. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఇప్పుడు పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పనివేళలను 10 గంటలకు పెంచడం, మహిళలను రాత్రి పూట పనికి బలవంతం చేయడం వంటి చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రయత్నాలు కొనసాగితే కార్మిక లోకం తిరగబడక తప్పదని హరినాథ్ హెచ్చరించారు. నోయిడాలో కార్మిక హక్కుల కోసం పోరాడిన 400 మంది కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా మేడేను విజయవంతం చేసిన కార్మికులకు హరినాథ్ అభినందనలు తెలియజేస్తూ, కార్మిక ఐక్యతతోనే హక్కులు సాధ్యమని పునరుద్ఘాటించారు.