BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:38 PM
88 వీక్షణలు

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

“ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!” అనే నినాదాలతో మేడే ఉత్సాహం రాష్ట్రమంతా మార్మోగింది. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఇప్పుడు పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పనివేళలను 10 గంటలకు పెంచడం, మహిళలను రాత్రి పూట పనికి బలవంతం చేయడం వంటి చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రయత్నాలు కొనసాగితే కార్మిక లోకం తిరగబడక తప్పదని హరినాథ్ హెచ్చరించారు. నోయిడాలో కార్మిక హక్కుల కోసం పోరాడిన 400 మంది కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా మేడేను విజయవంతం చేసిన కార్మికులకు హరినాథ్ అభినందనలు తెలియజేస్తూ, కార్మిక ఐక్యతతోనే హక్కులు సాధ్యమని పునరుద్ఘాటించారు.