BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 May, 2026 - 09:38 PM
133 వీక్షణలు

మేడే స్పూర్తి ఉరకలు… కార్మిక హక్కుల కోసం గళమెత్తిన విస్సన్నపేట

“ప్రపంచ కార్మికులారా ఏకంకండి… పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప!” అనే నినాదాలతో మేడే ఉత్సాహం రాష్ట్రమంతా మార్మోగింది. ఏఐసిసిటియు ఆధ్వర్యంలో 140వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి హరినాథ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు రక్తం చిందించి సాధించిన ఎనిమిది గంటల పనిదినాన్ని ఇప్పుడు పాలకులు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ పాలనలో చంద్రబాబు ప్రభుత్వం పనివేళలను 10 గంటలకు పెంచడం, మహిళలను రాత్రి పూట పనికి బలవంతం చేయడం వంటి చర్యలు పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ సంస్థల లాభాల కోసం కార్మికుల హక్కులను తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి ప్రయత్నాలు కొనసాగితే కార్మిక లోకం తిరగబడక తప్పదని హరినాథ్ హెచ్చరించారు. నోయిడాలో కార్మిక హక్కుల కోసం పోరాడిన 400 మంది కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా మేడేను విజయవంతం చేసిన కార్మికులకు హరినాథ్ అభినందనలు తెలియజేస్తూ, కార్మిక ఐక్యతతోనే హక్కులు సాధ్యమని పునరుద్ఘాటించారు.