BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

మైక్రో ఫైనాన్స్ రుణాలకు దూరంగా ఉండండి – డిఆర్డిఏ ఏపిఎం దయాల రాజశేఖర్ సూచనలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 05:36 PM
112 వీక్షణలు

నెక్కలం గొల్లగూడెం గ్రామంలో ప్రశాంతి గ్రామైక్య సంఘం ఈసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిఆర్డిఏ ఏపిఎం దయాల రాజశేఖర్ హాజరయ్యారు. ఆగిరిపల్లి మండలంలో ఏసీఎల్పీ (అడ్వాన్స్ క్రెడిట్ లైవ్ లీహుడ్ ప్లాన్) కార్యక్రమం భాగంగా ఈ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా దయాల రాజశేఖర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలు మైక్రో ఫైనాన్స్ సంస్థల వద్ద రుణాలు తీసుకోవద్దని సూచించారు. ఈ సంస్థలు అధిక వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఛార్జీలు వసూలు చేయడంతో మహిళలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏసీఎల్పీ ద్వారా అనేక రుణ సదుపాయాలు అందిస్తున్నట్లు వివరించారు. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి బ్యాంకు, ఉన్నతి పథకం, సిఐఎఫ్ పథకం, గ్రూప్ పొదుపుల ద్వారా అవసరమైన రుణాలు పొందవచ్చని చెప్పారు.

రుణాలు అవసరమైన సభ్యులు గ్రూప్ సమావేశం నిర్వహించి, అవసరాల వివరాలను నిర్ణయించి, సీసీ సహాయంతో బయోమెట్రిక్ నమోదు చేసి బ్యాంకులు లేదా స్త్రీనిధి ద్వారా రుణాలు పొందవచ్చని వివరించారు.

మైక్రో ఫైనాన్స్ సంస్థల రుణ వలయంలో చిక్కుకోకుండా, సిబిఓల ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలని మహిళలకు సూచించారు.

ఇప్పటివరకు ఈ ఏడాది ఏసీఎల్పీ కింద 1047 స్వయం సహాయక సంఘాలు సుమారు రూ.75 కోట్ల రుణ అవసరాన్ని బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీసీ లక్ష్మీ, వీవోఏ విజయ, సంఘ సభ్యులు సంధ్య, ప్రసన్నతతో పాటు ఎస్‌ఎస్‌జీ మహిళలు పాల్గొన్నారు.