మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే
మైలవరంలో మేడే సందడి.. పింఛన్ల పంపిణీతో ప్రజల మధ్యకు ఎమ్మెల్యే
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మే డే సందర్భంగా శుక్రవారం పలు కీలక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణప్రసాదు ప్రజలతో నేరుగా మమేకమవుతూ పింఛన్ల పంపిణీతో పాటు కార్మికుల పండుగలో పాల్గొననున్నారు. ఉదయం 7:30 గంటలకు ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేస్తారు. అనంతరం ఉదయం 8 గంటలకు ఇబ్రహీంపట్నం ఏ కాలనీలో టీఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందనే సందేశాన్ని ఈ కార్యక్రమాల ద్వారా అందించనున్నారు. కూటమి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మీడియా ప్రతినిధులు హాజరై కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేయాలని కోరారు.