BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
24 Aug, 2026 - 08:47 PM
14 వీక్షణలు

మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు...

అన్నమయ్య జిల్లా.

 మదనపల్లి.

అన్నమయ్య జిల్లా మదనపల్లె: మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కార్యాలయ తలుపులు మూసివేసి సిబ్బంది సమక్షంలో రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలు, రికార్డులను అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో అవకతవకలు, అనధికారిక నగదు లావాదేవీలు తదితర అంశాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలోని సిబ్బంది, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సంబంధిత రికార్డులను పరిశీలిస్తూ వివరాలను సేకరిస్తున్నారు.

తనిఖీలు పూర్తయిన అనంతరం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు లేదా ఇతర వివరాలపై అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం మదనపల్లె సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలతో ఉత్కంఠ నెలకొంది.

 ఏసీబీ ఎస్పీ విజయలక్ష్మి ఆదేశాలతో డీఎస్పీ, సీఐల బృందం సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏకకాలంలో దాడులు జరిపారు. ఈ దాడుల్లో పది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారి వద్ద లభించిన సుమారు రూ.30 వేల నగదును సీజ్ చేశారని తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించాల్సి ఉంది.